4.2 KiB
4.2 KiB
మిద్యాను, మిద్యానీయుడు, మిద్యానీయులు
వాస్తవాలు:
అబ్రహాము అతని భార్య కుమారుడు మిద్యాను. అరేబియా అరణ్యంలో ఉత్తరాన ఉన్న ప్రజాగుంపు పేరు కూడా మిద్యాను, ఇది కానాను భూబాగానికి దక్షిణాన ఉంది. ఆ ప్రజాగుంపులోని ప్రజలను “మిద్యానీయులు” అని పిలుస్తారు.
- మోషే మొదట ఐగుప్తును విడిచినప్పుడు, మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ యిత్రో కుమార్తెలను కలుసుకొన్నాడు, వారికి సహాయం చేసాడు, వారి మందలకు నీరు అందించాడు. తరువాత మోషే యిత్రో కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకొన్నాడు.
- యోసేపును బానిస వర్తర్తకులైన మిద్యాను గుంపు వారు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు.
- అనేక సంవత్సరాల తరువాత మిద్యానీయులు కనాను దేశంలోని ఇశ్రాయేలీయులపై దాడి చేసి వారిని ఆక్రమించుకొన్నారు. వారిని ఓడించడానికి గిద్యోను ఇస్రాయేలీయులను నడిపించాడు.
- ప్రస్తుతం అరేబియా గోత్రాలు ఈ గుంపు సంతానమే.
(చూడండి: అరేబియా, ఐగుప్తు, మంద, గిద్యోను, యిత్రో, మోషే)
బైబిలు రెఫరెన్సులు:
- అపొస్తలులకార్యములు 07:29-30
- నిర్గమ 02:15-17
- ఆదికాండం 25:1-4
- ఆదికాండం 36;34-36
- ఆదికాండం 37:27-28
- న్యాయాధిపతులు 07:1
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 16:03 అయితే ప్రజలు దేవుణ్ణి మరచిపోయారు, తిరిగి విహ్రహాలను పూజించడం ఆరంభించారు.
అందుచేత దేవుడు వారిని ఓడించడానికి వారికి సమీపంగా ఉన్న శత్రు గుంపు మిద్యానీయులను అనిమతించాడు.
- 16:04 ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు, మిద్యానీయులకు కనబడకుండ వారు గుహలలో దాగుకొన్నారు,
- 16:11 అతని స్నేహితుడు, “గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుందని ఈ కలభావమా?” అని అడిగాడు.
- 16:14 దేవుడు మిద్యానీయులను గందరగోళ పరచాడు, అందుచేత వారు ఒకరినొకరి మీద దాడి చేసి ఒకరినొకరు చంపుకొన్నారు.
పదం సమాచారం:
- Strong's: H4080, H4084, H4092