5.5 KiB
5.5 KiB
ఇశ్రాయేలు రాజ్యము
వాస్తవాలు
సోలోమోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఇశ్రాయేలు ఉత్తర భాగాన్న ఉన్న ప్రాంతం ఇశ్రాయేలు రాజ్యంగా మారింది.
- ఉత్తరాన్న ఉన్న ఇశ్రాయేలు రాజ్యానికి పది గోత్రాలు ఉన్నాయి, దక్షిణాన్న ఉన్న యూదా రాజ్యానికి రెండు గోత్రాలు ఉన్నాయి.
- ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని సమరయ. యూదా రాజ్య రాజధాని యెరూషలెంకు 50 కిలోమీటర్లు దూరం ఉంది.
- ఇశ్రాయేలు రాజ్యం రాజులు అందరూ దుష్టులు. ప్రజలు విగ్రహాలను, తప్పుడు దేవతలను పూజించునట్లు వారిని ప్రభావితం చేసారు.
- ఇశ్రాయేలు రాజ్యంపై దాడి చెయ్యడానికి దేవుడు అస్సీరియా వారిని పంపించాడు. అస్సీరియా వారు ఇశ్రాయేలులో అనేకులను తమ దేశంలో ఉండేలా బందీలుగా తీసుకొని వెళ్ళారు.
- ఇశ్రాయేలులో మిగిలిన వారిమధ్య ఉండడానికి అస్సీరియావారు అన్యులను తీసుకొని వచ్చారు. ఈ అన్యులు ఇశ్రాయేలు వారితో పెళ్ళిళ్ళు చేసుకొన్నారు, వారి సంతానమే సమరయ ప్రజలుగా మారారు.
(చూడండి: అస్సీరియ, ఇశ్రాయేలు, యూదా, రాజ్యము, సమరయ)
బైబిలు రెఫరెన్సులు:
బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:
- 18:08 రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు దేశం పది గోత్రాలు తమకు రాజుగా యరోబామును నియమించుకొన్నారు. వారు తమ రాజ్యాన్ని ఉత్తరాన్న ఉన్న భూభాగంలో ఏర్పరచుకొన్నారు, దానిని ఇశ్రాయేలు రాజ్యం అని పిలిచారు.
- 18:10 యూదా రాజ్యమూ, ఇశ్రాయేలు రాజ్యమూ శత్రువులుగా మారాయి, తరచుగా ఒకరితో ఒకరు పోరాడుకొంటూనే ఉన్నాయి.
- 18:11 క్రొత్త ఇశ్రాయేలు రాజ్యం లో రాజులందరూ దుష్టులే.
- 20:21 ఇశ్రాయేలు రాజ్యం , యూదా రాజ్యం రెండూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాయి.
- 20:02 శక్తివంతమైన, క్రూరమైన అస్సీరియనుల రాజ్యం ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసింది. అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యము లో అనేకమంది ప్రజలను చంపారు, విలువైన ప్రతీ దానిని తీసుకొని వెళ్ళారు, దేశంలో అధిక భాగాన్ని కాల్చివేశారు.
- 20:04 అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యము ఉన్న ప్రదేశంలో నివసించడానికి అన్యులను తీసుకొని వచ్చారు. పాడైపోయిన పట్టణాలను అన్యులు తిరిగి కట్టారు, అక్కడ నిలిచిపోయిన ఇస్రాయేలీయులను వివాహాలు చేసుకొన్నారు. అన్యులను వివాహం చేసుకొన్న ఇశ్రాయేలీయుల సంతానాన్ని సమరయులు అని పిలుస్తారు.
పదం సమాచారం:
- Strong's: H3478, H4410, H4467, H4468