5.5 KiB
5.5 KiB
యెహోషువా
వాస్తవాలు:
బైబిల్లో అనేకమంది ఇశ్రాయేలు మనుషుల పేరు యెహోషువా. వీరిలో ప్రఖ్యాత వ్యక్తి నూను కుమారుడు యెహోషువా. ఇతడు మోషే సహాయకుడు. మోషే తరువాత దేవుని ప్రజల ప్రముఖ నాయకుడు అయ్యాడు.
- యెహోషువా మోషే వాగ్దాన దేశంలోకి పంపిన పన్నెండు మంది గూఢచారుల్లో ఒకడు.
- కాలేబుతో కలిసి యెహోషువా ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఆజ్ఞకు లోబడి వాగ్దాన దేశంలో ప్రవేశించి కనానీయులను ఓడించమని ప్రోత్సహించాడు.
- అనేక సంవత్సరాలు తరువాత, మోషే చనిపోయాక, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి నియమించిన నాయకుడు యెహోషువా.
- కనానీయులపై మొదటి అత్యంత ప్రఖ్యాతిగాంచిన సమరంలో యెహోషువా ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి యెరికోను ఓడించాడు.
- పాత నిబంధన పుస్తకం యెహోషువాలో యెహోషువా ఏవిధంగా ఇశ్రాయేలీయులను నడిపించి వాగ్దాన దేశం స్వాధీనం చేసుకుని ప్రతి గోత్రానికి భూభాగం కేటాయించిన విషయం రాసి ఉంది.
- యోజాదాకు కుమారుడు యెహోషువా హగ్గయి, జెకర్యా గ్రంథాల్లో కనిపిస్తాడు; అతడు ప్రధాన యాజకుడు. యెరూషలేము గోడల నిర్మాణంలో సహాయం చేశాడు.
- యెహోషువా అనే పేరు గల అనేక ఇతర వ్యక్తులను బైబిల్ వంశ వృక్షాలలో మనం చూడగలం.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కనాను, హగ్గయి, యెరికో, మోషే, వాగ్దాన దేశం, (జెకర్యా ))
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 14:04 ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులు చేరినప్పుడు మోషే పన్నెండుమంది మనుషులను ఒక గోత్రం నుండి ఒకరు చొప్పున ఎన్నుకున్నాడు. అతడు వారికి ఆ దేశం ఎలాటిదో వేగు చూడమని సూచనలు ఇచ్చాడు.
- 14:06 తక్షణమే కాలేబు యెహోషువా, ఈ ఇద్దరు గూఢచారులు, "కనాను వారు నిజంగానే పొడవైన బలమైన ప్రజలు, అయితే మనం తప్పనిసరిగా వారిని ఓడించగలం!"
- 14:08 యెహోషువా కాలేబు, తప్ప ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాలకు వయసు పై బడిన వారంతా చనిపోయి వాగ్దాన దేశంలోకి ప్రవేశించరు."
- 14:14 మోషే ఇప్పుడు చాలా వృద్దుడయ్యాడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు సహాయం చెయ్యడానికి యెహోషువా ను ఎన్నుకొన్నాడు.
- 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడ్డాడు.
- 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటి శక్తివంతమైన యెరికో పట్టణంపై దాడి చేయాలని దేవుడు యెహోషువా కు చెప్పాడు.
పదం సమాచారం:
- Strong's: H3091, G2424