2.2 KiB
2.2 KiB
కిద్రోను లోయ
వాస్తవాలు:
కిద్రోను లోయ అనేది యెరూషలేం నగరానికి వెలుపల, దాని తూర్పు గోడ మరియు ఒలీవల పర్వతం మధ్య ఉన్న లోతైన లోయ.
- లోయ 1,000 మీటర్ల లోతు మరియు దాదాపు 32 కిలోమీటర్ల పొడవు ఉంది.
- రాజైన దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, అతను కిద్రోను లోయ గుండా ఒలీవల కొండకు వెళ్లాడు.
- అబద్ధ దేవుళ్ల ఉన్నత స్థలాలను, బలిపీఠాలను పగులగొట్టి కాల్చివేయాలని రాజు యోషియా మరియు యూదా రాజు ఆసా ఆజ్ఞాపించారు; బూడిదను కిద్రోను లోయలో త్రోసివేసారు.
- హిజ్కియా రాజు పరిపాలనలో, య్యజకులు ఆలయం నుండి తీసివేసిన అశుద్ధమైన ప్రతిదానిని కిద్రోను లోయలో త్రోసి వేసారు.
- దుష్టరాలిన రాణి అతల్యా ఆమె చేసిన చెడ్డ పనుల కారణంగా ఈ లోయలో చంపబడింది.
(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా])
(ఇవి కూడా చూడండి: [అబ్షాలోము], [ఆసా], [అతల్యా], [డేవిడ్], [తప్పుడు దేవుడు], [హిజ్కియా], [ఎత్తైన ప్రదేశాలు], [యోషియా], [యూదా], [ఒలీవల పర్వతం])
బైబిలు రిఫరెన్సులు:
- [యోహాను 18:1]
పదం సమాచారం:
- Strong's: H5674, H6939, G27480, G54930