te_tq/mat/04/23.md

1.0 KiB

ఈ సమయంలో బోధించడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?

యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).

ఏ ఏ రకాల ప్రజలు యేసు దగ్గరకు తేబడుతున్నారు? యేసు వారికి ఏమి చేస్తున్నాడు?

నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).

ఈ సమయంలో ఎంతమంది యేసును అనుసరిస్తున్నారు?

ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).